క్వారంటైన్ కేంద్రంలో పూర్తిస్థాయిలో సదుపాయాలు అందించాలని అని ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి బొబ్బిలి పట్టణ పరిధిలో ఉన్న ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాలలో 230 పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన కోవిడ్ క్వరెంటైన్ సెంటర్ లో నిర్వహిస్తున్న పనులు పరిశీలించారు, కేంద్రాల కరోనా చికిత్స పొందుతున్న వారికి అందజేస్తున్న సేవల పై అరా తీశారు. ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ కరోనా సోకినా ఆందోళన చెందొద్దని ధైర్యంగా ఉంటే కరోనా జయించడం సాధ్యం అన్నారు. ఎక్కడ ఎటువంటి పొరపాట్లు జరుగ కుండా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కేంద్రంలో చికిత్స పొందుతున్న వారికి ఏటువంటి అసౌకర్యం కలుగ కుండా చూడాలని అన్నారు. 24 గంటలు త్రాగునీరు, విద్యుత్ కు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి అన్నారు. కేంద్రంలో, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే కేంద్రం నిర్వహణకు సంబంధించి వైద్యులు, సిబ్బంది, మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. చికిత్స తీసుకుంటున్న వారికి సకాలంలో వైద్యం, నిర్దేశిత మెనూ ప్రకారం పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలి అని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి.ఎం.అండ్.హెచ్.ఓ రవి కుమార్ రెడ్డి, బొబ్బిలి మున్సిపల్ కార్యాలయం, మండల రెవెన్యూ ఆధికారులు, సిబ్బంది వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్లు సిబ్బంది, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.