శంఖవరంలో 61మందికి కోవిడ్ వేక్సినేషన్..


Ens Balu
2
శంఖవరం
2021-05-07 14:35:59

శంఖవరం పీహెచ్సీలో 61 మందికి కోవిషీల్డ్ కోవిడ్ వేక్సిన్ వేసినట్టు పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ తెలియజేశారు. శుక్రవారం ఆయన  ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం మండల అధికారుల ద్వారా టోకెన్ విధానం అమలు చేసిందని, వాటి ఆధారంగా వేక్సినేషన్ ప్రక్రియ జరిపినట్టు చెప్పారు. దీనికోసం ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాట్లు చేసినట్టు ఆయన వివరించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వేక్సినేషన్ ప్రక్రియ వేగంగా పూర్తిచేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ సమయంలో కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు డాక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ సిబ్బంది, ఆశ వర్కర్లతోపాటు, పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు.
సిఫార్సు