ప్రజారోగ్యానికే తొలి ప్రాధాన్యత..


Ens Balu
4
Anantapur
2021-05-11 13:06:14

ప్రజా ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామని అనంతపురం నగర మేయర్ వసీం పేర్కొన్నారు. మంగళవారం ఆవరణలో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ బెల్ మిస్టర్ స్ప్రేయింగ్ మిషన్ ద్వారా సోడియం హైపోక్లోరైట్  స్ప్రేయింగ్ ను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్  మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అందులో భాగంగానే నగరంలో పారిశుద్ధ్య మెరుగు పరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనితోపాటు హైపో క్లోరైడ్ ను నగరంలో పెద్ద ఎత్తున స్పేయింగ్ చేయిస్తున్నామని చెప్పారు.  ప్రజలు కూడా తమ వంతుగా సహకరించాలని మేయర్  కోరారు.అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. బయటకు వస్తే మాస్క్ దరించడంతో పాటు బౌతిక దూరం పాటించాలని సూచించారు. మీ ఆరోగ్యం మీ రక్షణ మీ చేతుల్లోనే ఉందదనే విషయాన్ని గుర్తించాలని మేయర్ సూచించారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
సిఫార్సు