ప్రణాళిక బద్దంగా వేక్సినేషన్ ప్రక్రియ..


Ens Balu
5
Salur
2021-05-13 13:52:53

వెక్షినేషన్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని ఐ.టి.డి. ఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్ పేర్కొన్నారు.  గురువారం పీఓ తన పర్యటనలో భాగంగా సాలూరు మండలం భాగువలస పి.హెచ్.సిలో  ఏర్పాటు చేసిన వాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించి అక్కడ వున్న ఆరోగ్య కార్యకర్తలు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో మాట్లాడి వారి క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. వాక్సినేషన్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని అన్నారు. అలాగే టీకా వేయించు కోవడానికి వచ్చిన వారికి ఏటువంటి ఆసౌకర్యం కలుగకుండా చూసుకోవాలని, అలాగే వారికి టీకా వేయించుకున్న ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ లు ధరించి సామాజిక దూరం పాటిస్తూ చేతులు శుభ్రం చేసుకోనెలా వారికి అవగాహన కల్పించాలన్నారు. ఈ పర్యటనలో డిప్యూటీ డి.ఎం.అండ్.హెచ్.ఓ డాక్టర్ రవి కుమార్ రెడ్డి, పి.హెచ్.సి వైద్యులు, ఎ.ఎన్.ఎం లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు