పోలీసులకు మజ్జిగ, ఆహారం వితరణ..


Ens Balu
6
Simhachalam
2021-05-21 08:07:38

కరోనా మహమ్మారి ప్రజాజీవితాలను అతలాకుతలం చేస్తున్న వేళ అన్ని వర్గాలకు రక్షణగా  నిలిచే పోలీసులను, పారామెడికల్, సచివాలయ , పారిశుధ్య  సిబ్బందినీ గౌరవించాలని సామాజిక వేత్త విజినిగిరి భాలభాను మూర్తి పిలపునిచ్చారు. శుక్రవారం ఎండలో సింహాచలం నుంచి ఎన్ఏడీ వరకూ రోడ్డులో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి మజ్జిగ, ఆహార పొట్లాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతీ ఒక్కరూ కరోనా సమయంలో ప్రభుత్వ నిభందనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలన్నారు. భౌతిక దూరం పాటిస్తూ ఖచ్చితంగా మాస్కులు ధరించాలన్నారు. ప్రజల సహకారంతోనే కరోనా వైరస్ నియంత్రణకు మార్గం సుగమం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా గ్రామీణ వైద్యుల సంఘం కార్యదర్శి లోగిశ గణేష్,  కె.వి.సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు