టోకెన్లు ఉన్నవారికే కోవిడ్ వేక్సిన్..


Ens Balu
4
శంఖవరం
2021-05-23 13:04:23

శంఖవరం పీహెచ్సీ పరిధిలో ప్రభుత్వం మంజూరు చేసిన కోవిడ్ టోకెన్లు తీసుకున్నవారికి టీకా వేస్తామని వైద్యాధికారి డా.ఆర్వీవీ సత్యన్నారాయణ పేర్కొన్నారు. ఆదివారం ఈమేరకు పీహెచ్సీలో ఆయన మీడియాతో మాట్లాడారు. సోమవారం కోవిడ్ వేక్సినేషన్ ప్రక్రియ పీహెచ్సీ పక్కనేవున్న జిల్లా పరిషత్ స్కూలులో నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిభందనల మేరకు టోకెన్లు పొందిన వారు మాత్రమే వేక్సినేషన్ దగ్గరకు రావాలన్నారు. అదే సమయంలో ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ వేక్సినేషన్ ప్రక్రియకు సహకరించాలన్నారు. శంఖవరంలో కోవిడ్ కేసులు అధికంగా వున్నందున ప్రజలు వైద్యసిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.
సిఫార్సు