వన్ ధన్ వికాస్ ద్వారా గిరి మహిళలకు ఆర్ధిక ఉపాది


Ens Balu
3
సొలబం గ్రామం
2020-08-28 20:00:00

వన్ దన్ వికాస్ కేంద్రం ద్వారా గిరిజన మహిళలకు ఉపాది పూర్తిస్థాయిలో కలుగుతుందని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మిలు అన్నారు. శుక్రవారం జి.మాడుగుల మండలం సొలభం పంచాయతీ వనభరంగి పాడు గ్రామంలో వన్ దన్ వికాస్ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడ ఉపాది పొందుతున్నవారితోపాటు వీరు కూడా కుట్టు మిషన్లపై విస్తరాకులు కుట్టి అక్కడి మహిళలను చైతన్య పరిచారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ, మహిళలలు, విస్తరాకులర, ప్లేట్స్ తయారీ ద్వారా ఆర్ధికంగా స్థిరపడాలని ఆకాంక్షించారు. కరోనా వైరస్ ను ద్రుష్టిలో ఉంచుకొని  సామాజిక దూరం పాటిస్తూ, ఈ కేంద్రం ద్వారా ఉపాది పొందాలన్నారు. ఇలాంటి కేంద్రాలు విశాఖ ఏజెన్సీలోని 11 మండలాల్లో విస్తరించాలని నిర్వాహకులను కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపి జెడ్పిటిసి రెడ్డి అభ్యర్థి మత్స్య  వెంకట్ లక్ష్మి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గాయత్రీ దేవి, రాష్ట్ర కార్యదర్శి  విశ్వేశ్వర  రాజురు, సోలభం సర్పంచ్ హనుమత్ రావు ,జి మాడుగుల మండల అధ్యక్షుడు సత్యనారాయణ, డీపీఎం సత్యం నాయుడు,వెలుగు ఏపిడివో నాగేశ్వరరావు,  వైఎస్ఆర్ సీపీ నాయకులు పాల్గొన్నారు.