సప్తగిరులపై శ్రీవారి పూజకి సాహసం ఎలా చేస్తారంటే...
Ens Balu
4
Tirumala Up Road
2020-08-30 16:34:38
కలియుగ ప్రత్యక్ష్య దైవం ఆ తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి. ప్రక్రుతిలో ప్రతీచోటా ఆయన ఉంటారనడానికి నిదర్శనమే తిరుమల ఘాట్ రోడ్డులో ఒక కొండపై ఆయన ముఖ భింబపు రాయి పోలి వుంటుంది. ఆ స్వామివారి రూపానికి నిత్యం అక్కడ పూజారులు పూజలు చేస్తుంటారు. అదేదో మామూలు కొండ అయితే పర్లేదు...తిరుమల సప్తగిరులాయే. దీంతో నడుముకి తాడు కట్టుకొని, కవాల్సిన సామాన్లన్నీ కవరులో పెట్టుకొని, మరొకరి సహాయంలో శ్రీవారి రూపానికి దండలు వేయడంతోపాటు, కుంకుమ, పసుపు పెట్టి పూజలు చేస్తారు. అలాంటి అరుదైన ద్రుశ్యకావ్యం ఈఎన్ఎస్ పాఠకుల కోసం ప్రత్యేకంగా అందించాలని సంకల్పించాం. సప్తగిరులలో ఒ శిలపై వెలసిన ఆ దేవ దేవునికి అక్కడి పురోహితులు ఏ స్థాయిలో సాహసం చేసి పూజలు చేస్తున్నారో మీరూ ఒక్కసారి చూడండి...గోవింద నామస్మరణతో స్వామివారికి పూజలు చేసే తీరు ఒక్కసారిగా ఒళ్లు గగుర్పాటుకి గురిచేస్తుంది. కానీ ఆ స్వామివారి లీలలు ఎవరికీ అంతుపట్టవు కదా, స్వామి భక్తులతో ఎప్పుడు ఎక్కడ, ఏ విధంగా పూజలు చేయించుకుంటారో జీవికోటికి తెలియదు అనడానికి గరుడ పర్వతంపై ఉన్న ఆయన రూపానికి పూజలు చేయడం, అదీ భారీ ఎత్తులో ఉన్న కొండపై పురోహితులు సాహసం చేసి మరీ పూజలు చేయడం స్వామివారి మహిమగానే చెప్పవచ్చుననడానికి ఇదో నిదర్శనం...