కరోనా టీకాకి ప్రజలు ముందుకి రావాలి..


Ens Balu
4
Sankhavaram
2021-06-24 17:19:47

కరోనా వైరస్ నియంత్రణకి ప్రతీ ఒక్కరూ సహకరించి టీకా వేయించుకోవడానికి ముందుకి రావాలని శంఖవరం ఈఓపీఆర్డీ కెవివిఎస్ విశ్వనాధ్, పంచాయతీ కార్యదర్శి రామచంద్రమూర్తి(రాంబాబు) పిలుపునిచ్చారు. గురువారం ప్రభుత్వ హైస్కూలులో ఏర్పాటు చేసిన శాస్వత కోవిడ్ వేక్సిన్ కేంద్రంలోని టీకా పంపిణీ కార్యక్రమాన్ని వీరు పరిశీలించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ, ప్రభుత్వం 5ఏళ్లలోపు పిల్లలున్న తల్లులకు కోవిడ్ వేక్సినేషన్ లో ప్రధాన్యత ఇస్తుందన్నారు. థర్ఢ్ వేవ్ ని ద్రుష్టిలో పెట్టుకొని పిల్లల తల్లులందరికీ వేక్సిన్ వేస్తున్నామన్నారు. అదేవిధంగా మొదటి డోసు తీసుకుని 84 రోజులు పూర్తయిన వారికి రెండో డోసు కూడా వేస్తున్నట్టు చెప్పారు. ముఖ్యంగా ప్రజలు అపోహలు వీడి ప్రభుత్వ నిభందనల మేరకు వేక్సినేషన్ వేయించుకోవాలన్నారు. పీహెచ్సీవైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ మాట్లాడుతూ, కరోనా నిబంధనలు అనుసరించి వేక్సినేషన్ చేపడుతున్నామన్నారు.  ఈరోజు సెషన్ లో 200 మందికి కోవిడ్ టీకాలు వేసినట్టు డాక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో సచివాలయం2,3 కార్యదర్శి శంకరాచార్యులు, సత్య, జూనియర్ అసిస్టెంట్ రమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

సిఫార్సు