గృహ నిర్మాణాలు గ్రౌండింగ్ జరగాలి..


Ens Balu
2
Tekkali
2021-06-27 16:47:00

పేదలకు కేటాయించిన లే అవుట్ల లో గృహ నిర్మాణాలు గ్రౌండింగ్ అయ్యేటట్లు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ అధికారులను ఆదేశించారు. ఆదివారం స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారులు, తాసిల్దారు ఎంపీడి ఒలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే గృహ నిర్మాణాలు పూర్తయ్యేందుకు  ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందన్నారు. గ్రామ సచివాలయం పరిధిలో సిబ్బందితో సమావేశం నిర్వహించి ఇళ్ళ లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ గ్రౌండింగ్ చేసుకునేటట్లు చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో  ఇన్ ఛార్జ్ ఆర్ డి ఓ సీతారామమూర్తి, మండల ప్రత్యేక అధికారి డా, మంచు కరుణాకర్ రావు, తాసిల్దార్ ఎస్. గణపతి, ఎంపీడీవో పి. నారాయణ మూర్తి, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్ .నీలయ్య, సర్వేయర్ సుభాష్, తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు