పండుగలా గ్రుహనిర్మాణ మేళా..


Ens Balu
2
Parvathipuram
2021-06-28 13:11:38

ఆర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి సొంతింటి కళ సాకారం చేసేందుకు ఆన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఐ.టి.డి.ఎ ప్రోజెక్ట్ అధికారి ఆర్ కూర్మనాథ్ పేర్కొన్నారు.  జూలై 1 న నిర్వహించనున్న మెగా  గ్రౌండింగ్ మేళాకు ముందస్తు ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా పార్వతీపురం మండలం నర్సిపురం గ్రామంలో హౌసింగ్ లేఅవుట్ ను సోమవారం ప్రోజెక్ట్ అధికారి సందర్శించారు, ఈ సందర్భంగా చేపడుతున్న ఏర్పాట్ల పై సంబంధిత అధికారులతో సమీక్షించి సూచనలు అందించారు. అనంతరం ప్రోజెక్ట్ అధికారి మాట్లాడుతూ జూలై 1న చేపట్టనున్న మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళాలో మండలంలో మంజూరైన 55 లేఅవుట్లలో, సొంత స్థలాలలో 207  మొత్తం 3165 మంజూరు కాగా అందులో 735 గ్రౌండింగ్ పూర్తి అయ్యాయని మిగిలిన ఇళ్లు జూలై 1న గ్రౌండింగ్  అయ్యేలా ఆన్ని చర్యలు చేపట్టాలని, మెగా  గ్రౌండింగ్ మేళా ఇళ్లు నిర్మాణానికి ముందుకు వచ్చేలా చర్యలు చేపట్టాలని, మెగా మేళా ఒక పండగ వాతావరణంలో చేపట్టాలని ఆన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మండల ప్రత్యేక అధికారి, బి.సి కార్పొరేషన్ ఇ.డి నాగరాణి, ఎం.పి.డి.ఓ కృష్ణా రావు , హౌసింగ్ డి.ఇ తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు