మోడ్రన్ టెక్నాలజీపై సర్వేయర్లకు శిక్షణ..ఆర్డీఓ


Ens Balu
1
Paderu
2020-09-02 15:10:51

సర్వేయర్లు నూతన సాంకేతిక విధానాల ద్వారా సర్వే చేయడం నేర్చుకుంటే రాబోయే  భూసర్వేకి ఎంతో ఉపయుక్తంగా వుంటుందని పాడేరు ఆర్డీఓ కె.లక్ష్మి శివజ్యోతి పిలుపునిచ్చారు. బుధవారం మోడరన్ టెక్నాలజీ మీద గ్రామ సర్వేయర్ లకు ఏర్పాటు చేసిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ మొదటి దశ శిక్షణా కార్యక్రమాన్ని ఆమె ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సర్వేయర్లకు నూతన టెక్నాలజీపై శిక్షణ ఇచ్చిన అన్ని అంశాల్లో వీరిని సమర్ధవంతంగా తయారు చేయాలని భావించిందన్నారు. ఇందులో భాగంగా మొదటి దశ లో భాగంగా తేదీ 02-09-2020 నుండి 01-10-2020 వరకు పి.ఎమ్.ఆర్. సి. లో జరుగుతుందని ఆమె చెప్పారు. ఈశిక్షణలో సర్వేయర్లు పూర్తిస్థాయిలో శిక్షణ తీసుకొని ప్రభుత్వ సర్వేకి అనుగుణంగా తయారు కావాలన్నారు. కొత్తగా టెక్నాలజీపై ఇచ్చే శిక్షణ పూర్తిస్థాయిలో పొందడం ద్వారా రాబోయే రోజుల్లో ఎలాంటి తప్పులు లేకుండా సర్వే చేయడానికి అవకాశం వుంటుందన్నారు. ఈ కార్యక్రమం లో బి.య న్. ప్రసాద్ ( డిప్యూటీ ఇనస్పెక్టర్ ఆఫ్ సర్వేయర్) మరియు పి.శ్యామ్ ప్రసాద్ ( ఏ.ఓ.) తదితరులు పాల్గొన్నారు.