విద్యార్ధులకు మాస్కులు పంచిన సమిథ..


Ens Balu
5
Cheemalapadu
2021-07-07 14:34:16

కరోనా సమయంలో విద్యార్ధులు అత్యంగ జాగ్రత్తగా ఉండాలని సమిథ నిర్వాహకులు వీరభద్రరావు అన్నారు. బుధవారం రావికమతం మండలం చీమలపాడు గ్రామంలోని పాఠశాల విద్యార్ధులకు SHG95 మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాలతోపాటు, వెనుకబడిన ప్రాంతాల్లోని పాఠశాలల విద్యార్ధులకు తమ సంస్థ ద్వారా దాతలు ఇచ్చిన ప్రోత్సాహంతో సేవాకార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కరోనా వైరస్ ఉన్నంత కాలం ప్రతీ ఒక్కరూ మాస్కులు తప్పని సరిగా ధరించడంతోపాటు, బౌతిక దూరం, చేతుల పరిశుబ్రత చేసుకోవాలన్నారు. అనంతరం విద్యార్ధులకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని అమెరికాకు చెందిన అనూప్ రాజ్ సహకారంతో చేపట్టినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంగరాజు, కార్యదర్శి చిన్నయ్యనాయుడు సంస్థ ప్రతినిధులు నాగమణి, బుద్దరాజు, సింహాద్రి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు