మరపురాని మహానేత డా.వైఎస్సార్..


Ens Balu
5
Sankhavaram
2021-07-08 05:51:13

ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఒకేఒక్క వ్యక్తి మహా నేత, దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్.రాజశేఖరరెడ్డి మాత్రమేనని అని ఎంపీపీ అభ్యర్ధి పర్వత రాజబాబు పేర్కొన్నారు. గురువారం డా.వైఎస్సార్ జయంతి సందర్భగా శంఖవరం మండల కేంద్రంలో ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ, విద్యార్ధులకు ఫీజ్ రీఎంబర్సుమెంట్ లాంటి చారిత్రక సంక్షేమ పథకాలు అందించిన మహా మనిషి అన్నారు. భౌతికంగా ఆ మహానేత మన మధ్యలేకపోయినా ప్రతీ అభిమాని గుండె చప్పుడు ఆయనేగా ఉండిపోయారన్నారు. అంతటి మహానేత జయంతిని రాష్ట్రప్రభుత్వం రైతు దినోత్సవంగా ప్రకటించి ఆయన కన్న కలలను నేటి యువ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. అనంతరం కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచిపెట్టారు. ఎస్సీకాలనీలోని విగ్రహానికి కూడా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్, చింతంనీడి కుమార్, కార్యదర్శి రామచంద్రమూర్తి, జానియర్ అసిస్టెంట్ రమణమూర్తి, గ్రామ పెద్దలు, వైఎస్సార్సీపీ నాయకులు పర్వత సత్యన్నారాయణమూర్తి, కొండమూరి చంటిబాబు, సర్పంచ్ బందిలి చిన్నయ్యమ్మ, మండల మేనేజర్ పడాల సతీష్, పడాల బాషా,బిసి కార్పోరేషన్ డైరెక్టర్ కిల్లి పార్వతి, కార్యకర్తలు మూడు సచివాలయాల కార్యదర్శిలు, మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, సచివాల సబ్బంది, వాలంటీర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 
సిఫార్సు