పేదల గుండెల్లో నిలిచిన మహా మనిషి డా. వైఎస్సార్...


Ens Balu
2
Kurmannapalem
2020-09-02 16:07:06

మహానేత స్వర్గీయ డా. వై ఎస్ రాజశేఖరరెడ్డి నిరుపేదలు మరువలేని మహా మనిషి అని  గాజువాక నియోజకవర్గం  ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి అన్నారు. డా.వై ఎస్సార్  11 వ వర్ధంతి కార్యక్రమాన్ని  87 వ వార్డు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టి కార్పోరేటర్ అభ్యర్థి బొడ్డ గోవింద్ ఆధ్వర్యంలో కుర్మన్నపాలెం కూడలి వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  దేవన్ రెడ్డి మాట్లాడుతూ, మరణం లేని మహనీయుడు మన ప్రియతమ నాయకుడు దివంగత వైఎస్సార్ మాత్రమేనన్నారు.  అనంతరం వృద్ధులకు, నిరుపేదలకు పండ్లు,  రొట్టెలు, దుస్తులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షులు చిత్రాడ వెంకటరమణ, వడ్లపూడి ఈశ్వరరావు, బొడ్డ వెంకటసూరి, దుగ్గపు సూరిబాబు, గెద్దాడ చిన్న అప్పన్న, దరిగి రవి, దుగ్గపు సత్యనారాయణ, దొడ్డి వెంకటసత్యనారాయ, నరసింహ మూర్తి,  పిన్నింటి సంతోష్, చిత్రాడ రాజు, హరీష్ వర్మ, కాండ్రేగుల కనక లక్ష్మి,  గాలి నూకరాజు, ఇర్ని వెంకట్రావు, అప్పారావు, బద్దెమ్ ప్రసాద్, డి ఎన్ మూర్తి, కణితి శ్రీను, రాజు, గురుగుబెల్లి అప్పలస్వామి, బొడ్డ దామోదర్, గేదల ఆరుద్ర,  ఎన్ శంకర్, పి ఆనందరావు, పి మురళి, రాజకుమార్, శ్రీనివాస్, రమణ, ఎన్ వి రమణ, ప్రసాద్, లక్ష్మణ రావు, సూరిబాబు, అజయ్, శ్రీను, ఝాసువా, త్రినాద్ తదితరులు పాల్గొన్నారు.