ప్రజల గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు..


Ens Balu
2
Sankhavaram
2021-07-08 13:48:28

ప్రజల గుమ్మం ముందుకే సేవలు అందించాలనే లక్ష్యంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిందని కాకినాడ ఎంపీ వంగా గీత అన్నారు. గురువారం శంఖవరం మండల కేంద్రంలోని నూతంగా నిర్మించిన గ్రామసచివాలయం-1  భవనాన్ని ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్, జిల్లా కలెక్టర్ జి.మురళీధరరెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, భారత దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఏపీలోనే గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు గ్రామంలోనే 745 సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో ఏర్పాటు చేసి గ్రామసచివాలయాల ద్వారా ప్రజలు పూర్తిస్థాయిలో సేవలు గ్రామాల్లోనే పొందాలని ఆమె కోరారు.  ఎమ్మెల్యే మాట్లాడుతూ,  గాంధీజి కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని ప్రజలకు అందించాలనే లక్ష్యంతో సీఎం వైఎస్.జగన్మోమహన రెడ్డి ఈ సచివాలయ వ్యవస్తను అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. మహిళలు, గ్రామ సంరక్షణ కోసం మహిళా పోలీసులు, దిశ యాప్ ను కూడా స్థాపించారన్నారు. అన్ని జిల్లాల్లోనూ దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి అక్క, చెల్లమ్మలకు ఏ కష్టం లేకుండా చూసుకుంటున్నారని అన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సచివాలయ భవనాలను ఎంతో చక్కగా నిర్మించారన్నారు. శంఖుస్థాపన, ప్రారంభంలోనూ ఎమ్మెల్యే పాల్గొనడం సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మల్లిబాబు, ఎంపీపీ అభ్యర్ధి పర్వత రాజబాబు, తహశీల్దార్ సుబ్రమణ్యం, ఎంపీడీఓ రాంబాబు,  గ్రామ ఉప సర్పంచ్, కుమార్, కార్యదర్శి రామచంద్రమూర్తి, జానియర్ అసిస్టెంట్ రమణమూర్తి, గ్రామ ఉప సర్పంచ్, చింతంనీడి కుమార్, వైఎస్సార్సీపీ నాయకులు పర్వత సత్యన్నారాయణమూర్తి, కొండమూరి చంటిబాబు, సర్పంచ్ బందిలి చిన్నయ్యమ్మ, మండల మేనేజర్ పడాల సతీష్, పడాల బాషా,బిసి కార్పోరేషన్ డైరెక్టర్ కిల్లి పార్వతి, కార్యకర్తలు మూడు సచివాలయాల కార్యదర్శిలు, వీఆర్వోలు, మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, సచివాల సబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. 

సిఫార్సు