గ్రామస్వరాజ్యం YSRCP తోనే సాధ్యం..
Ens Balu
2
Sankhavaram
2021-07-08 13:58:59
దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్సార్ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని రాష్ట్రవ్యాప్తంగా అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వతశ్రీపూర్ణచంద్రప్రసాద్ అన్నారు. గురువారం శంఖవరం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన గ్రామసచివాలయం-3 భవనాన్ని ఎంపీ వంగా గీత, జిల్లా కలెక్టర్ జి.మురళీధరరెడ్డి, ఆర్డీఓ మల్లిబాబులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే ప్రజలకు గ్రామంలోనే అన్ని సేవలు అందించడానికి ఈ సచివాలయాలను ఏర్పాటు చేశారన్నారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున నూతన భవనాలను నిర్మించారన్నారు. దివంతగత ముఖ్యమంత్రి జన్మదినోత్సవం సందర్భంగా ఆయన గుర్తుగా ఈ నూతన భవనాలను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉన్నదన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఒకేసారి మూడు సచివాలయ భవనాలు ప్రారంభించడం శుభపరిణామమన్నారు. ఎంపీ వంగా గీత మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదల కోసం ఏం చేయడానికైనా..సంక్షేమం కోసం ఎంత ఖర్చుచేయడానికైనా వెనుకాడదనే విషయం ఒక్క గ్రామ సచివాలయాలను చూసి చెప్ప వచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఎంపీపీ అభ్యర్ధి పర్వత రాజబాబు, తహశీల్దార్ సుబ్రమణ్యం, ఎంపీడీఓ రాంబాబు, గ్రామ ఉప సర్పంచ్, కుమార్, కార్యదర్శి రామచంద్రమూర్తి, జానియర్ అసిస్టెంట్ రమణమూర్తి, గ్రామ ఉప సర్పంచ్, చింతంనీడి కుమార్, వైఎస్సార్సీపీ నాయకులు పర్వత సత్యన్నారాయణమూర్తి, కొండమూరి చంటిబాబు, సర్పంచ్ బందిలి చిన్నయ్యమ్మ, మండల మేనేజర్ పడాల సతీష్, పడాల బాషా,బిసి కార్పోరేషన్ డైరెక్టర్ కిల్లి పార్వతి, కార్యకర్తలు మూడు సచివాలయాల కార్యదర్శిలు, వీఆర్వోలు, మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, సచివాల సబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.