వార్త ప్రసాద్ కుటుంబానికి రూ.2.12లక్షల ఆర్థిక సహాయం.


Ens Balu
2
Gajuwaka
2020-09-02 16:51:20

విశాఖజిల్లాలోని గాజువాకలో వార్త దినపత్రికలో పనిచేస్తూ మరణచించిన ప్రసాద్ కుటుంబానికి  గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, గాజువాక ఇంచార్జ్ దేవన్ రూ.2.12లక్షలు ఆర్దిక సహాయం అందజేశారు. బుధవారం ఈ మేరకు ఆ మొత్తాన్ని ప్రసాద్ కుటుంబానికి వీరు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగిరెడ్డి మాట్లాడుతూ, ప్రసాద్ అధికారులు, ప్రజాప్రతినిధులతో ఎంతో చక్కగా వ్యవహరిస్తూ,  ప్రజా సమస్యలపై మంచి వార్తా కధనాలు రాసేవారన్నారు. అలాంటి వ్యక్తి గుండెపోటుతో మరణిచండం ఎంతగానో కలచివేసిందన్నారు. ఆర్ధిక సహాయంలో గాజువాక నియోజకవర్గ జర్నలిస్టులు రూ. 67500 ,అలాగే  ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, నియోజకవర్గం ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి పిలుపుతో వ్తెఎస్సార్సీపి కార్పొరేటు అభ్యుర్దులు, నాయకులు స్పందించి రూ. 1.15 లక్షలు, బిజేపి నాయకులు రూ.15వేలు, జనసేన ఐదువేలు,బయట వ్యక్తులు రూ.10 వేలు సహాయం అందించారు. అంతేకాకుండా  ఎమ్మెల్యే స్పందిస్తూ, జర్నలిస్ట్  ప్రసాదు పిల్లలకు ఉపాధి కల్పించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.  అలాగే తిప్పల దేవన్ రెడ్డి,వైసీపీ నాయకులు దర్మాల శ్రీను, గౌస్, జర్నలిస్టులు మూల. గిరిబాబు, సాక్షి శశి, శేషు, పరశురాము,గుప్తా,మూర్తి, సాయి, శిరీష, సందీప్.గోవింద్, కృష్ణ, కృష్ణశ్రీ, రాజు తదితరులు పాల్గొన్నారు.