కరోనా ద్రుష్ట్యా యూనివర్శిటీ పరీక్షలు రద్దు చేయాలి..


Ens Balu
2
శంఖవరం
2020-09-02 16:54:37

దేశంలో,రాష్ట్రంలో కరోనా విళయతాండవం చేస్తున్న సమయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల పరీక్షలు పెట్టి  వారి ప్రాణాలతో ఆటలు అడుతోందని ఎస్ఎఫ్ఐ మండలఎం.గంగాసూరిబాబు అన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ అల్ ఇండియా కమిటీ పిలుపు మేరకు స్థానిక శంఖవరం తహశీల్దార్ కార్యలయం విద్యార్ధులు  నిరసన తెలియజేయజేశారు. ఈ సందర్భంగా జిల్లా అద్యక్షుడు మాట్లాడుతూ, కరోనా విపత్కర పరిస్థితి లో దేశ వ్యాప్తంగా జరుగుతున్న జెఈఈ పరిక్షలకి మన రాష్ట్ర లో 30శాతం మంది పైగా విద్యార్థులు గైర్హాజరు అయ్యారన్నారు. పరిక్ష రాయడానికి కూడా సరైన ప్రజా రవాణా వ్యవస్థ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారుని ఆరోపించారు.  దేశ వ్యాప్తంగా జరగబోయే నీట్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. యూనివర్శిటీల్లో నిర్వహించ తలపెట్టిన పరీక్షలను కూడా తక్షణమే నిలుపుద చేయాలన్నారు.   జిల్లా లో కరోనా కేసులు పెరుగుతున్న పట్టించుకోకుండా  పరిక్షలు నిర్వహిస్తే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సి వుంటుందన్నారు.  అనంతరం శంఖవరం మండలం తహశీల్దార్ కె.సుబ్రహ్మణ్యంకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మండలం కార్యదర్శి బి.శివరాజు, సహయకార్యదర్శి పి.శివ మాదవ్, ఉపాద్యక్షులు పి.కుశరాజు, తదితరులు పాల్గొన్నారు.