శంఖవరం శాస్వత కోవిడ్ టీకా కేంద్రంలో 100 మందికి కరోనా వేక్సిన్ వేసినట్టు సచివాలయ-1 వీఆర్వో సీతారాం తెలియజేశారు. శనివారం ఈ మేరకు శంఖవరం మండల కేంద్రంలోని కోవిడ్ టీకా కేంద్రంలో వీఆర్వో దగ్గరుండి రెండవ డోస్ వారికి టీకాలు వేయించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిచేసి ఈ ప్రక్రియ మొత్తం పూర్తిచేశామన్నారు. దానికోసం ముందురోజు మూడు సచివాలయాల పరిధిలోని వాలంటీర్ల ద్వారా అన్నివార్గాల వారికి సమాచారం అందించి టీకా కార్యక్రమానికి ప్రజలు వచ్చేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, డిజిటల్ అసిస్టెంట్ జనార్ధన్, వెల్పేర్ అసిస్టెండ్ చిరంజీవి, సచివాలయం2 కార్యదర్శి సత్య, వైద్య సిబ్బంది, వైఎస్సార్సీపీ నాయకులు పడాల బాష, పడాల షతీష్, తదితరులు పాల్గొన్నారు.