398 మందికి సెకెండ్ డోస్ కరోనా వేక్సిన్..
Ens Balu
4
Sankhavaram
2021-07-10 15:07:50
శంఖవరం ప్రాధమిక ఆరోగ్యం పరిధిలో 398 మందికి కరోనా టీకాలు వేసినట్టు పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవిసత్యన్నారాయణ తెలియజేశారు. శనివారం పీహెచ్సీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం మంజూరు చేసిన 40 కోవీషీల్డ్ వైల్స్ తో 398 మందికి వేక్సినేషన్ పూర్తిచేశామన్నారు. గతంలో ఒకే కేంద్రంలో వేక్సినేషన్ చేసేవారని ఇపుడు మండలంలో నాలుగు చోట్ల ఈ కరోనా వేక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో అన్ని కేంద్రాలకు వేక్సినేషన్ సరఫరా చేస్తున్నామన్నారు. ఈరోజు ముఖ్యంగా రెండవ డోసు వేసుకునేవారికే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు వైద్యాధికారి తెలియజేశారు.