శంఖవరంలో 176మందికి కరోనా వేక్సినేషన్..


Ens Balu
2
శంఖవరం
2021-07-13 13:44:59

శంఖవరం ప్రాధమిక ఆరోగ్యం పరిధిలోని సచివాలయంలో 176 మందికి కరోనా టీకాలు వేసినట్టు సచివాలయం-2 కార్యదర్శి శంకరాచార్యులు తెలియజేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం మంజూరు చేసిన 300 కోవీషీల్డ్ వైల్స్ ను శంఖవరం మండల కేంద్రంలో వైష్ణవమాన్యం ప్రాంతంతో పాటు మూడు చోట్ల క్యాంపులు నిర్వహించి అక్కడ రెండవ డోసు పూర్తిచేశామన్నారు. గతంలో ఒకే కేంద్రంలో వేక్సినేషన్ చేసేవారని ఇపుడు మండల కేంద్రంలో పలు ప్రాంతాల్లో వేక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ కరోనా వేక్సినేషన్ సరఫరా చేస్తున్నామన్నారు. ఈరోజు ముఖ్యంగా రెండవ డోసు వేసుకునేవారికే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు సచివాలయ కార్యదర్శి తెలియజేశారు.

సిఫార్సు