స్పందన దరఖాస్తులు పరిష్కరించాలి..


Ens Balu
3
Dumbriguda
2021-07-15 13:35:22

విశాఖ ఏజెన్సీలోని తహశీల్దార్ కార్యాలయాలకు వచ్చిన స్పందన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని సబ్ కలెక్టర్ వి.అభిషేక్ తహశీల్దార్ జయప్రకాష్ నుఆదేశించారు. గురువారం సబ్ కలెక్టర్ డుంబ్రిగుడ ఎమ్మార్వో తాహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని పలు రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మీసేవ సర్వీసులు, సచివాలయ సర్వీస్ రిక్వెస్టులు, స్పందన ,
పిఓఎల్ఆర్ , రెవెన్యూ పెండింగ్ విషయాలపై చర్చించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం డుంబ్రిగుడలం  పంటలచింత  గ్రామంలో   జాతీయ రహదారి 516 (NH-516) పనులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో తాహశీల్దార్ తోపాటు సర్వేయర్ చిరంజీవి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామ్మూర్తి, జెఇ (NH)రమేష్  తదితరులు పాల్గొన్నారు.

సిఫార్సు