RBKలు ప్రారంభం విజయవంతం కావాలి..


Ens Balu
3
Sankhavaram
2021-07-15 13:42:38

శంఖవరం మండల కేంద్రంలో జూలై16న ప్రారంభించే రైతు భరోసా కేంద్రాల ప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ నాయకులు, ఉపసర్పంచ్ కుమార్ కోరారు. గురువారం సచివాలయం-1 లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలో ఒకేసారి 3ఆర్బీకేలు ఎమ్మెల్యే పర్వతపూర్ణచంద్రప్రసాద్ సారధ్యంలో మంత్రులు ప్రారంభిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమాన్ని వాలంటీర్లు, వారి కేటాయించిన కుటుంబాల వారు, రైతులతో విచ్చేసి విజయవంతం చేయాలన్నారు. కార్యదర్శి-1 రాంబాబు మాట్లాడుతూ, విధిగా వాలంటీర్లు ప్రభుత్వ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో మూడు సచివాలయాల కార్యదర్శిలు రాంబాబు, శంకరాచార్యులు, సత్య, మహిళాపోలీస్ జిఎన్ఎస్ శిరీష, జూనియర్ సహాయకులు రమణమూర్తి, వైఎస్సార్సీపి నాయకులు పడాల సతీష్, పడాల భాషా, సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.
సిఫార్సు