విశాఖజిల్లాలోని సబ్బవరం తవ్వవానిపాలెంలో పొనిపిరెడ్డి సత్యన్నారాయణ మాస్టారు ఉద్యోగ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సహచర ఉపాధ్యాయులు మాట్లాడుతూ, సత్య మాస్టారి సేవలు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎన్నటికీ మరిచిపోలేరని అన్నారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ, దేశ అభివృద్ధికి విద్య ఎంతో అవసరమని భావించి ఎంతోమంది విద్యార్థులు భావిభారత పౌరులుగా తీర్చి దిద్దిన ఘనత మాస్టారికే దక్కుతుందన్నారు.1996 వా సంవత్సరంలో ప్రభుత్వ ఉపాధ్యాయు వృత్తిని చేపట్టి ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పారని కొనియాడారు. అంతే కాకుండా మాస్టారు విద్యార్థులకు, వయోజనులకు ఉచిత యోగా శిక్షణ కేంద్రాన్ని స్థాపించి తద్వారా వారి ఆరోగ్యానికి బాటలు వేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, మాస్టారి కుటుంబ సభ్యులు, విద్యార్ధులు పాల్గొన్నారు.