భద్రాద్రి మన్యంలో ఎన్ కౌంటర్ ఒకరు మ్రుతి...


Ens Balu
6
దేవలగూడెం
2020-09-03 12:23:24

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దేవల గూడెం వద్ద పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదరుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్ లో  ఒకరు మృతి చెందగా.. మరో మావోయిస్టు తప్పించుకున్నారని జిల్లా ఎస్పీ సునీల్ స్పష్టంచేశారు. కొద్దిసేపటి క్రితం జరిగిన ప్రదేశాన్ని ఎస్పీ పోలీసులకు వెళ్లి సందర్శించారు. సంఘటనా స్థలం నుంచి ఒక వ్యక్తి మృత దేహాన్ని స్వాధీనం  చేసుకున్నామని...  పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఎస్పీ చెప్పారు. మరోవైపు మావోయిస్టు అగ్రనేత గణపతి, పార్టీ కేంద్ర కమిటీకి చెందిన మల్లోజుల వేణుగోపాల్‌తో పాటు మరికొందరు లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కొండపల్లి సీతారామయ్య హయాంలో గణపతి, మల్లోజులతో పాటు పార్టీలో చేరిన కటకం సుదర్శన్ కూడా లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది..ఈ క్రమంలోనే జరిగిన ఎన్ కౌంటర్ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఓ వైపు మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు, అదే మావోయిస్టులతో ఎన్ కౌంటర్ తో గిరిజన పల్లెలు భయాందోళనతో ఒణికిపోతున్నాయి.