రాష్ట్ర మంత్రులకు శంఖవరంలో ఘనస్వాగం..


Ens Balu
3
Sankhavaram
2021-07-16 14:53:35

శంఖవరం మండల కేంద్రంలోని 2 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించడానికి వచ్చిన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ లకు ఎమ్మెల్యే పర్వతశ్రీపూర్ణచంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. సచివాలయ కార్యదర్శి రామచంద్రమూర్తి, ఇతర అధికారులు, వేద పండితులు మంగళవాయిద్యాలతో మంత్రుల బ్రుందానికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు వ్యవసాయశాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించి సచివాలయం-2, 3 పరిధిలోని రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ ఏడి సుంకర బుల్లిబాబు, ఏఓ కెజెచంద్రశేఖర్, హార్టికల్చర్ అధికారి శ్రీవల్లి, పశుసంవర్ధశాఖ ఏడి డా వీర్రాజు, వైద్యులు కె.ప్రసాద్, లావణ్య, ప్రియాంక, తహశీల్దార్ సుబ్రమణ్యం, ఎంపీడీఓ రాంబాబు, మూడు సచివాలయాల కార్యదర్శిలు రాంబాబు, శంకరాచార్యులు, సత్య, మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, జూనియర్ సహాయకులు రమణమూర్తి, సర్పంచ్ బందిలి గన్నయ్యమ్మ, ఉప సర్పంచి చింతంనీడి కుమార్, పర్వత స్వామి, బుర్రాలచ్చబాబు, పడాల భాషా, పడాల సతీష్, పడాల గంగాధర రామారావు మండలంలోని అగ్రికల్చర్ అసిస్టెంట్లు, గ్రామవాలంటీర్లు, రైతులు పాల్గొన్నారు.
సిఫార్సు