శంఖవరంలో మెగా దిశ అవగాహనా శిబిరం..


Ens Balu
10
Sankhavaram
2021-07-20 07:08:49

దిశ యాప్ పై నిర్వహించే మెగా అగాహన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉపసర్పంచ్ సిహెఎచ్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం శంకవరం మండలకేంద్రంలోని సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే పర్వతప్రసాధ్ సారధ్యంలో స్థానిక సత్యదేవ కళ్యాణ మండపంలో బుధవారం నిర్వహించే కార్యక్రమాన్ని వాలంటీర్లు విజయవంతం చేయాలన్నారు. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దిశ యాప్ ని సచివాలయాల్లోని అన్నివర్గాల వారితో ఈయాప్ ఇనిస్టాల్ చేయించాలన్నారు. అలాంటి మంచి కార్యక్రమంలో అందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో 3సచివాలయాల కార్యదర్శిలు రాంబాబు, శంకరాచార్యులు, సత్య, మహిళా పోలీసు జిఎన్ఎస్ శిరీష, వీఆర్వో సీతారాం, సచివాలయ జూనియర్ సహాయకులు రమణమూర్తి, సిబ్బంది, వైఎస్సార్సీపీ నాయకులు పడాల భాషా, పడాల సతీష్, శ్రీరామ్మూర్తి, తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు