శాకాంబరిగా దర్శమివ్వనున్న నూకాలమ్మ..
Ens Balu
3
Sankhavaram
2021-07-22 13:28:55
అన్నవరంలోని బిసీకాలనీ వేంచేసి వున్న శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ తల్లి శనివారం శాకాంభరిగా దర్శనమివ్వనున్నారు. ఈ మేరకు ఆలయ ధర్మకర్త గంగరాజు అమ్మవారి అలంకరణకు సంబంధించి కమిటీ ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన గురువారం ఆలయంలో మీడియాతో మాట్లాడుతూ, గురుపౌర్ణమిని పురుస్కరించుకొని అమ్మవారిని శాఖాంభరిగా అలంకరించనున్నామన్నారు. అరోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి వరకూ ప్రత్యేక దర్శలు, తీర్ధ ప్రసాదాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలనుకునే భక్తులు 9492509024 నెంబరు ద్వారా ఆర్ధిక సహాయం, విరాళాలు పంపవచ్చునన్నారు. స్థానికంగా వున్నవారు కమిటీని సంప్రదించి అమ్మవారి అలంకరణకు కూరగాయలను సైతం సమర్పించవచ్చునన్నారు. ఆరోజు అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు విశేషంగా తరలిరావాలన్నారు. కోవిడ్ నిబంధనలకు లోబడి దర్శన ఏర్పాట్లు చేసినట్టు ధర్మకర్త వివరించారు.