తూర్పుగోదావరి జిల్లాకు వాతావరణ శాఖ భారీ వర్షాలు సూచించిన నేపథ్యంలో శుక్రవారం రాత్రి అన్నవరంలో భారీ వర్షం కురిసింది. దానికితోడు ఇదే సమయంలో అనధికార విద్యుత్ కోతలు విధంచడంతో అన్నవరం వాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా అన్నవరం దేవస్థానం, బిసీ కాలనీ, నూకాలమ్మ అమ్మవారి దేవాలయం ప్రాంతాల్లో ప్రజలు దోమలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాధారణంగానే ఈ ప్రాంతంలో విద్యుత్ లో లోఓల్టేజి అధికంగా వుంటుంది. ఈ సమయంలో శుక్రవారం దానికి వర్షాలు తోడవడంతో ఇక్కడి ప్రజలు వర్ణణతీతమనే చెప్పవచ్చు.