ITDA పీఓ సచివాలయ ఆకస్మిక పర్యటన..
Ens Balu
4
Parvathipuram
2021-07-28 13:58:44
గ్రామ వలంటిర్లు తమ పరిధిలోగల 50 కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృధి కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని ప్రాజెక్ట్ అధికారి కూర్మనాథ్ పేర్కొన్నారు. పీఓ బుధవారం తన పర్యటనలో భాగంగా పార్వతీపురం మండలం డి.కె.పట్నం, వెంకం పేట గ్రామ సచివాలయాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు, సచివాలయాల్లో అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం ప్రోజెక్ట్ అధికారి మాట్లాడుతూ సిబ్బంది పనిచేసే చోట నివాసం ఉండాలని, సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ ఆదేశాలను, నియమాలను అందరూ తప్పకుండా అనుసరించాలని, సేవలలో పారదర్శకత పాటించాలని సిబ్బందికి సూచించారు. అందరూ సమయ పాలన పాటించి విధులు నిర్వహించాలన్నారు. పిర్యాదులు సేకరణ పరిష్కారంలో అలసత్యం వద్దని సూచించారు. ఈ క్రమంలో సిబ్బంది హాజరు పట్టిక, ప్రగతి నివేదికల రికార్డుల పరిశీలించారు. గ్రామంలో ప్రతి ఒక్కరికీ కరోనా నిర్మూలనకు సంబంధించిన జాగ్రత్తలు మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటిస్తూ, చేతులు శుభ్రం చేసుకోవాలి అని అందరిలో అవగాహన కల్పించాలన్నారు. ఈ పర్యటనలో పార్వతీపురం మండల రెవెన్యూ అధికారులు, సచివాలయాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.