అవగాహన కల్పించే బాధ్యత వలంటీర్లదే..


Ens Balu
3
Parvathipuram
2021-08-04 14:26:13

గ్రామ వలంటిర్లు తమ పరిధిలోగల 50 కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృధి కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని సబ్ కలెక్టర్ భావన ఆదేశించారు. బుధవారం పార్వతీపురం మున్సిపల్ పరిధిలో గల 8 , 9 వార్డుల సచివాలయాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు, సచివాలయంలో అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం సబ్ కలెక్టర్  మాట్లాడుతూ సిబ్బంది పనిచేసే చోట నివాసం ఉండాలని, సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ ఆదేశాలను, నియమాలను అందరూ తప్పకుండా అనుసరించాలని, సేవలలో పారదర్శకత పాటించాలని సిబ్బందికి సూచించారు. అందరూ సమయ పాలన పాటించి విధులు నిర్వహించాలన్నారు.  పిర్యాదులు సేకరణ పరిష్కారంలో అలసత్వం వద్దని సూచించారు. ఈ క్రమంలో సిబ్బంది హాజరు పట్టిక, ప్రగతి నివేదికల రికార్డుల పరిశీలించారు. 
సిఫార్సు