రక్తహీనత నుంచి గిరిజనులను కాపాడాలి..


Ens Balu
4
Rampachodavaram
2021-08-04 15:29:02

స్త్రీ శిశు సంక్షేమ శాఖ వైద్య ఆరోగ్యశాఖ శాఖలు సంయుక్తంగా గిరిజనులు రక్తహీనత నుఅధిగమిం చేందుకు చర్యలు చేపడుతూ మాతాశిశు మరణాలను తగ్గించాలని జిల్లా కలెక్టర్ సి హరి కిరణ్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయం ఐటీడీఏ పరిధిలోని సెక్టోరియల్ అధికారులతో సమావేశం నిర్వహించి పలు అంశాల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో ప్రవీణ్ ఆదిత్య భౌగోళిక నైసర్గిక ఐ టి డి ఎ స్వరూపాలను ప్రభుత్వ పరంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ వివరించారు. విద్యా కార్యక్రమాలపై సమీక్షించి పిమ్మట ఐటీడీఏ పరిధిలో మిగులు టీచర్లను డీఎడ్ కళాశాలల్లో బోధన కొరకు నియమించాలని డి డి ఎం సరస్వతిని ఆదేశించారు. రెగ్యులర్ పాఠశాలలో దివ్యాంగుల అవసరాల కొరకు వసతులను కల్పించాలని అందుకు అనుగుణంగా అంచనాలు రూపొందించిన సమర్పించాలని ఆదేశించారు. మాతా శిశు మరణాలు నివారణ  వరకు  ప్రసవాల  కొరకు నిరీక్షించు వార్డులలో సేవలు మెరుగుపరిచి బలోపేతం చేయాలని తదనుగుణంగా మాతాశిశు మరణాల రేటును తగ్గించాలని ఆదేశించారు వైద్య సేవలు మెరుగుదలకు ఏజెన్సీ పరిధిలో కమ్యూనికేషన్ వ్యవస్థను విస్తరించాలని సూచించారు. తీవ్ర పోషకాహార లోపాలు గల పిల్లలు గర్భిణీలు గుర్తించి ప్రత్యేక పోషకాహారం నుంచి అందించి ఆరోగ్య భద్రతకు పాటుపడాలన్నారు.

 కోవిడ్ మూడవ దశ పొంచి ఉన్నందున నివారణ చర్యలు ఆస్పత్రులను బలోపేతం చేయాలని ఆక్సిజన్ తో కూడిన పడకల సంఖ్యను అవసరాలకు అనుగుణంగా పెంచాలని ఆదేశించారు ప్రాంతీయ ఆసుపత్రి లో ఆర్ టి పి సి ఆర్ టెస్ట్ నిర్వహణకు యోచన చేయాలని అని సూచించారు. కోవిడ్ మూడో దశ సన్నద్ధత చర్యలను ఆయన సమీక్షించారు. మలేరియా నియంత్రణ చర్యలపై సమీక్షించి జ్వర పీడిత నుండి రక్త నమూనాలు సేకరించేందుకు లక్ష్యాలు నిర్దేశించి నియంత్రణ చర్యలు బలోపేతం చేయాలని ఆదేశించారు. గిరిజనుల అనారోగ్య సమస్యలు చాలా సున్నితమైనవని
 వాటి నివారణకు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ఉద్యాన సాగును వ్యవసాయాన్ని ఉపాధి హామీ అనుసంధానంతో ప్రోత్సహించి గిరిజన అభివృద్ధికి తోడ్పాటును అందించాలి అన్నారు. తోటల పెంపకం సంబంధించి అంటు మొక్కలు సరఫరా చేస్తూ అధిక దిగుబడులు సాధించేలా ప్రోత్సహించాలన్నారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం కింద గిరిజనులకు అందించిన భూములను నరేగా ద్వారా ఫలదాయకం గా తీర్చి దిద్ది ఉద్యాన పంటల సాగు  యాంత్రీకరణ ఉపకరణాల ద్వారా లాభసాటిగా మార్చాలని ఆదేశించారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం నందిని క్రీములను అన్ని దశలలో నిశితంగా పరిశీలించి అర్హులకు న్యాయం చేకూర్చాలని ఆదేశించారు. వర్షాధార పంట లను ప్రోత్సహించడంతో పాటు నీటి వనరులు ఉన్న చోట ఖరీఫ్లో వరి సాగును రబీ సీజన్లో అపరాలు సాగును ప్రోత్సహించాలని గిరిజన ప్రాంతాల్లో రబీ సీజన్ లో పశువుల కట్టడికి చర్యలు చేపట్టాలన్నారు.

 ఏజెన్సీ పరిధిలో బ్యాంకింగ్ వ్యవస్థ సేవలు విస్తరించాలని కలెక్టర్ దృష్టికి తెచ్చారు నాబార్డు ద్వారా రహదారులు విద్యాసంస్థల్లో వసతులు మెరుగుదలకు పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టాలన్నారు సి సి డి పి కింద అణగారిన కొండరెడ్ల అభ్యున్నతికి పాటుపడాలన్నారు.  ఐఎపి నిధులతో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో యువత కొరకు వసతులు మెరుగుపరిచి ఉపాధి కల్పనకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అటవీ  అభ్యంతరాలను శాఖల సమన్వయంతో పరిష్కరించుకుంటూ గిరిజన అభివృద్ధికి తోడ్పడాలి అన్నారు. గిరిజన ఆవాసాల్లో పూర్తిస్థాయిలో అనుసంధానం రోడ్లు వివిధ గ్రాంట్ కింద నరేగా అనుసంధానంతో వేయాలని ఆదేశించారు. వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్న ఇంజనీరింగ్ విభాగం వారు ఆయా పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారో గడువులు విధించి పర్యవేక్షణా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయిలు వేయాలని ccdp కింద 24 ఆవాసాలకు సౌరశక్తితో మంచినీటి సదుపాయం జరుగుతోందన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సమస్త ప్రయోజనాలను గిరిజనులకు వర్తింపజేసి  వారు పేదరికాన్ని జయించి ఆర్థిక ప్రగతి వైపు పయనించేలా చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. గిరిజనులు వీడి వీకే గ్రూపులుగా ఏర్పడి చిన్నతరహా అటవీ పాఠశాల సేకరించుకుని విలువ ఆధారితంగా మార్చుకునేందుకు ప్రాసెసింగ్ యూనిట్లు బాసటగా నిలుస్తున్నాయి అని ఉన్నాయని కోవిడ్ సమయంలో ఈ యూనిట్లను ప్రారంభించడం సంతోషంగా ఉన్నారు.

 ఏడు మండలాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు విలువ ఆధారిత పరిశ్రమల స్థాపించుకుని తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర పొందాలని సూచించారు ఏజెన్సీ పరిధిలో రెండు ఫుడ్ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదనలు ఒక్కొక్కటి 10 కోట్లతో చేయడం జరిగిందని తద్వారా ఒక్కొక్క దాని ద్వారా సుమారు పదివేల మంది ఆర్థికంగా లబ్ధి పొందగలరు అని ఆయన అన్నారు. ccdp కింద మినీ రైస్ మిల్లు పశువుల షెడ్లు ఏర్పాట్లకు ప్రతిపాదనలు చేయడం జరిగిందన్నారు వైయస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పోషణ అభియాన్ కింద రక్తహీనతను అధిగమించేందుకు చర్యలు చేపట్టి మాతా శిశు మరణాలు అరికట్టాలని  మాతా శిశు మరణాలు సంభవించినప్పుడు సంభవించడానికి గల కారణాలను అన్వేషించి ఆయా గ్యాపులను పూరించుకోవాలని ఆదేశించారు. సెక్టోరియల్ అధికారులు తమ పరిధిలో ఏవైనా సమస్యలు ఉత్పన్నం అయినప్పుడు నేరుగా  ఎస్ ఎం ఎస్ వాట్సాప్  చేయవచ్చునని తెలిపారు ఎస్ఎంఎస్ చేసినప్పుడు పేరు హోదా కూడా తెలపాలన్నారు. ఏజెన్సీ పరిధిలో ఆరోగ్య సమస్యలు చాలా సున్నితంగా ఉంటాయని ఆయా సమస్యల నివారణకు వైద్యులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. అధికారులకు ఏ విధమైన సపోర్ట్ అవసరమైన అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు అనంతరం మారేడుమిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని భర్వెయిటింగ్ హాల్ ఉన్న గర్భిణీల ఆరోగ్య స్థితిగతులను ఆరా తీశారు. సమయానికి వైద్య సహాయం భోజన వసతి అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అలాగే కలెక్టర్ గర్భిణీల కుటుంబాల ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. వ్యాధి నిరోధక టీకాలు ఇమ్యునైజేషన్ ప్రక్రియలు సకాలంలో నిర్వహించుకునే వదిలింది అడిగి తెలుసుకున్నారు. ఐరిస్కగర్భిణీలకు ముందుగానే గుర్తించి మెరుగైన వైద్య సేవలకు సిఫార్సు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో ప్రవీణ్ ఆదిత్య సబ్కలెక్టర్ సింహాచలం సబ్ డిఎఫ్ఒ నిషా కుమారి సెక్టోరియల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సిఫార్సు