ఆదివాసీల జీవితాల్లో ఆర్ఓఎఫ్ఆర్ వెలుగులు..


Ens Balu
6
Sankhavaram
2021-08-09 14:08:18

ఆంధ్రప్రదేశ్ లోని గిరిజనుల జీవితాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆర్ఓఆర్ఎఫ్ భూమి పంపంణీ చేసి వెలుగులు నింపుతోందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వతపూర్ణచంద్రప్రసాద్ అన్నారు. ప్రపంచ ఆదీవాసి దినోత్సవం సందర్భంగా శంఖవరం మండలంలోని ఎస్టీ సబ్ ప్లాన్ లో ఉన్న గిరిజనులకు  ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పంపిణీచేశారు. సోమవారం శంఖవరం మండల కేంద్రంలోని ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ, గిరిజనుల అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్ ఎల్లప్పుడూ కృషిచేస్తున్నారని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఇచ్చిన హామీని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి నెరవేర్చి చూపిస్తున్నారని అన్నారు. గిరిజనుల వెంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వుంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాంబాబు, తహశీల్దార్ బాలసుబ్రమణ్యం,  ఎంపీపీ అభ్యర్ధి పర్వత రాజబాబు,  మండలంలోని 14 పంచాయతీల సర్పంచ్ లు, స్థానిక సచివాలయ  కార్యర్శిలు శ్రీరామచంద్రమూర్తి, శంకరాచార్యులు, సత్య, ఉప సర్పంచ్ చింతంనీడి కుమార్, జూనియర్ సహాయకులు రమణమూర్తి, మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, వైఎస్సార్సీపీ నాయకులు లచ్చబాబు, పడాల సతీష్, పడాల బాష, అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.

సిఫార్సు