జగనన్న పచ్చతోరణం పెద్దఎత్తున సాగాలి..


Ens Balu
6
Sankhavaram
2021-08-09 15:53:59

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న జగనన్న పచ్చతోరణం కార్యక్రమం పెద్దఎత్తున ఉద్యమం సాగాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వతశ్రీపూర్ణచంద్రప్రసాద్ పిలుపునిచ్చారు. సోమవారం శంఖవరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన శ్రీ సత్యదేవ కళ్యాణ మండపంలో కొబ్బరి మొక్కలు నాటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పచ్చతోరణమంటే మొక్కలు, చెట్లు ఎక్కడికి వెళ్లినా స్వాగతం పలికేట్టుగా నాటాలన్నారు. ఎంపీడీఓ జె.రాంబాబు మాట్లాడుతూ, మండలంలో పెద్దఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రణాళిక సిద్దం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సచివాలయ  కార్యర్శిలు శ్రీరామచంద్రమూర్తి, శంకరాచార్యులు, సత్య, ఉప సర్పంచ్ చింతంనీడి కుమార్, జూనియర్ సహాయకులు రమణమూర్తి, మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, ఉపాది హామీ సిబ్బంది వైఎస్సార్సీపీ నాయకులు లచ్చబాబు, పడాల సతీష్, పడాల బాష, అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.
సిఫార్సు