సీజనల్ వ్యాధులపై ముందస్తు చర్యలు..


Ens Balu
4
Parvathipuram
2021-08-12 14:01:54

సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు చేపట్టాలని ఐ.టి.డి.ఎ ప్రోజెక్ట్ అధికారి ఆర్ కూర్మనాథ్ పేర్కొన్నారు. పార్వతీపురం ఏరియా 100 పడకల ఆసుపత్రిలో  పేసెంట్స్ తాకిడి అధికంగా ఉందని తెలిసిన వెంటనే ప్రోజెక్ట్ అధికారి ఏరియా ఆసుపత్రి పర్యటించి ఏరియా ఆసుపత్రి సూపరంటెండెంట్ డాక్టర్ వాగ్దేవి వారితో సమావేశమై ఆసుపత్రిలో ఉన్న రోగుల వివరాలు తదితర అంశాలపై ఆరా తీశారు. అనంతరం ప్రోజెక్ట్ అధికారి మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున, ఏటువంటి సమస్య  ఎదురయినా ఎదుర్ కోవడానికి సిద్దంగా ఉండాలని సూచించారు. అలాగే ఆసుపత్రి, పరిసర ప్రాంతాలు పరిశుబ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.  ఈ పర్యటనలో ఏరియా ఆసుపత్రి సూపరంటెండెంట్ డాక్టర్ వాగ్దేవి, ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
సిఫార్సు