భారత స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహనీయులను మార్గదర్శకంగా తీసుకోవాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ అరుణశ్రీ అన్నారు. ఆదివారం శంఖవరం ఐసీడిఎస్ సీడీపీఓ కార్యాలయంలో ఆమె జెండా ఎగురవేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గాంధీజీ ఈస్వరాజ్యం కోసమే కలలు గన్నారని అన్నారు. నేటి బిడ్డలు రేపటి ఆరోగ్య పౌరులుగా ఎదగాలంటే పౌష్టికాహరం ఎంతో అవసరమన్నారు. దాన్ని ఐసిడీఎస్ ఉచితంగా అందిస్తున్నదని వీటిని తల్లులు, కాబోయే తల్లులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తల సంఘం ప్రతినిధి బుల్లెమ్మ, ఇతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.