పేదలు అభివ్రుద్ధి చెందడమే నిజమైన స్వాతంత్య్రం..
Ens Balu
4
Sankhavaram
2021-08-15 13:49:59
నిరుపేదలు ఏరోజైతే అభివ్రుద్ధి చెందుతారో ఆరోజే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు అని ఉపసర్పంచ్ చింనీడి కుమార్ అన్నారు. ఆదివారం శంఖవరం గ్రామసచివాలయం-2లో ఆయన త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు. 75ఏళ్ల క్రితం మనికి స్వాతంత్య్రం రావడానికి ఎందరో మహానుభావులు త్యాగాలు చేశారన్నారు. వారి స్పూర్తితో నేడు సీఎం వైఎస్ జగన్ గ్రామాలు అభివ్రుద్ధి చెందాలనే లక్ష్యంతో గ్రామసచివాలయాలు ఏర్పాటు చేశారని కొనియాడారు. అలాంటి మంచి చోటలో జెండా ఎగురవేయడం ఎంతో ఆనందంగా వున్నదన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామసచివాలయ-2 కార్యదర్శి శంకరాచార్యులు, ఇన్చార్జి మహిళా పోలీస్ జీఎన్ఎస్ శిరీష, పంచాయతీ ఆరోగ్య సహాయకులు రమణమూర్తి, వైఎస్సార్సీపీ మండల నాయకులు పడాల సతీష్, పడాల భాష, గ్రామవాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.