శంఖవరం మండలం పరిధిలోని 25వేల గొర్రెలు, మేకలకు నట్టల నివారణ వేక్సిన్ పంపిణీ చేసినట్టు పశు సంవర్ధకశాక సహాయ సంచాలకులు డా.ఎం వీరరాజు తెలియజేశారు. గురువారం శంఖవరం పశువుల ఆసుపత్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. మొత్తం సుమారు 16 గ్రామ సచివాలయాల పరిధిలోని 14 పంచాయతీల్లో 30వే మేకలు,గొర్రెలు ఉండగా25 మేకలు, గొర్రెలకు వేక్సిన్ వేశామన్నారు. ఈనెలాఖరులో మిగిలిన వాటికి కూడా పూర్తి చేస్తామని ఏడి వివరించారు. వేక్సిన్ కోసం గ్రామ సచివాలయాల పరిధిలోని వెటర్నరీ సహాయకులను సంప్రదించాలని ఆయ సూచించారు.