ఆధార్ కేంద్రం తలార్ సింగ్ కి మార్పు..
Ens Balu
6
Paderu
2021-08-19 15:30:26
పాడేరు మండలం లోని చుట్టుపక్కల ఉన్న గిరిజనుల సౌకర్యార్థం జనాలు రద్దీ తగ్గించడం కోసం స్థానిక పిఎమ్ఆర్ సి నుంచి తలార్ సింగ్ ఇన్డోర్ స్టేడియంకు మార్చడమైనది. ఆధార్ కార్డులు నమోదు చేసుకొనుటకు ఈరోజు అనగా 19-8-2021 గురువారం నుండి ఏర్పాట్లు చేసినట్లు సబ్ కలెక్టర్ వి అభిషేక్ తెలిపారు. ఈ ఆధార్ కార్డు కేంద్రాన్ని సబ్ కలెక్టర్ ప్రారంభించారు.ఈరోజు 100 మందికి ఆధార్ కార్డులు నమోదు చేశారని రేపటినుంచి తలార్సింగ్ ఇన్డోర్ స్టేడియంలో నమోదులు జరుగు తాయని ఈ స్థలమార్పిడి విషయాన్ని ప్రజలందరూ గమనించి ఆధార్ కార్డు నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలని సబ్ కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ టి.విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.