త్వరితగతిన సచివాలయాలు పూర్తికావాలి.. జిల్లాకలెక్టర్


Ens Balu
2
Acchutapuram
2020-09-05 18:51:03

విశాఖజిల్లాలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసురావాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ పంచాయితీరా జ్ ఎస్.ఇ. ని ఆదేశించారు. శనివారం అచ్యుతాపురం మండలంలో పర్యటించి హరిపాలెం గ్రామం, కొండకర్ల ఆవ, చీమలాపల్లి గ్రామాలను ఆయన సందర్శించి నాడు – నేడు, రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. హరిపాలెం గ్రామంలో   కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనంను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కన్న కలలకు దగ్గరగా గ్రామ సచివాలయం ఉందన్నారు.  గ్రామ సచివాలయం  భవనం వలె రైతు భరోసా కేంద్రంను నిర్మించాలని తెలిపారు.  రైతు భరోసా కేంద్ర నిర్మాణం ఎన్ని రోజుల్లో పూర్తి చేసి అందుబాటులోకి వస్తుందని పంచాయితీ రాజ్ ఎస్.ఇ సుధాకర్ రెడ్డి.ని అడిగి తెలుసుకున్నారు.  నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో అనకాపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి సీతారామారావు, పంచాయితీ రాజ్ ఎస్.ఇ సుధాకర్ రెడ్డి, ఎస్.ఎస్.ఎ. పి.ఓ మల్లిఖార్జున రెడ్డి, తహసిల్థార్   నారాయణరావు, ఎంపిడిఓ మహేష్, తదితరులు పాల్గొన్నారు.