పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ చేయాలి..


Ens Balu
4
Sankhavaram
2021-08-25 16:16:29

ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు పారిశుద్ధ్య నిర్వహణ తరచూ చేపట్టాలని ఎంఈఓ ఎస్విరమణ పేర్కొన్నారు. బుధవారం శంఖవరంలోని ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం అందించిన పారిశుధ్య నిర్వహణ సామాగ్రిని ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ, ప్రభుత్వం నాడు-నేడు ద్వారా పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించినదని వాటి నిర్వహణకే వీటిని సరఫర  చేసిందన్నారు. వీటిని మరుగుదొడ్లు పరిశుభ్రం చేసించే బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. అన్ని పాశాలలకు సమాచారం అందించామని రెండుమూడు రోజుల్లో వీటి పంపిణీ పూర్తవుతుందన్నారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సిఫార్సు