ఎపడిమిక్ లో అప్రమత్తంగా ఉండాలి..


Ens Balu
4
Sankhavaram
2021-08-27 12:50:47

ఎపడమిక్ సీజన్ లో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఎంతో అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.పి.సరిత వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం శంఖవరం పీహెచ్సీలో వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణతోపాటు, సిబ్బందితో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం జ్వరాలు అధికంగా ఉన్నందున పారామెడికల్ సిబ్బందిని నిత్యం ఫీల్డులోనే ఉంచాలన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు రక్త పరీక్షలు చేయడంతోపాటు, మందులు ఇచ్చిన తరువాత వ్యాధి తీవ్రత ఎలాంవుందనే విషయంలోనూ పరిశీలన చేయాలన్నారు. అనంతరం ఆసుపత్రిలో మందుల లభ్యతను, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు ఆసుపత్రి ఓపీ రిజర్టర్లు, నిత్యం జరిగే పరీక్షలు, ఫీల్డు సిబ్బంది ఇచ్చే క్షేత్ర స్థాయి సమాచారంపై తీశారు. ఈ సీజన్ ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా, మందులు, మెడికల్ టెస్టుల సామాగ్రి ఇలా ఏది అవసరం వచ్చినా తక్షణమే సంప్రదించాలన్నారు. వైద్యసేవల్లో రాజీపడకూడదన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు..పి.రాజేష్, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.

సిఫార్సు