చురుగ్గా గ్రామసచివాలయాల నిర్మాణాలు..


Ens Balu
4
Rowthulapudi
2021-08-28 08:48:11

రౌతులపూడి మండలంలోని 26 గ్రామ పంచాయతీల పరిధిలోని 15 గ్రామ సచివాలయ భవనాల నిర్మాణాలు చురుక్కుగా సాగుతున్నాయని ఎంపీడీఓ నాయుడు తెలియజేశారు. శనివారం ఈ మేరకు రౌతులపూడి ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకూ 2 గ్రామసచివాలయాలు పూర్తయ్యాయని, మరో 4 భవనాలు నెలాఖరునాటికి పూర్తవుతాయన్నారు. మిగిలిన 11 భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది త్వరితగతిన భవనాల నిర్మాణ పనులు చేపడుతున్నారన్నారు. సాధ్యమైనంత త్వరలోనే భవనాలు పూర్తిచేస్తాయని ఎంపీడీఓ నాయుడు వివరించారు.

సిఫార్సు