పూర్తిస్థాయిలో కరోనా వేక్సిన్ అందించాలి..


Ens Balu
3
Rowthulapudi
2021-08-28 09:53:04

రౌతులపూడి మండలంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు పూర్తిస్థాయిలో కోవిడ్ వేక్సినేషన్ చేపట్టాలని ఎంపీడీఓ నాయుడు వైద్యసిబ్బందికి సూచించారు. శనివారం ఈ మేరకు రౌతులపూడి గ్రామసచివాలయం-1 పరిధిలో జరుగుతున్న కోవిడ్ వేక్సినేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ, ప్రభుత్వం 18 ఏళ్లు దాటిన వారికి కోవిడ్ టీకా వేయించాలని ఆదేశించిందని, అదే సమయంలో మొదటి డోసు తీసుకున్నవారికి రెండే డోసు కూడా వేయాలని చెప్పడంతో వాలంటీర్లు, ఆరోగ్యసిబ్బంది ఆదిశగా పనిచేసి అందిరికీ వేక్సిన్ అందించాలన్నారు. అంతేకాకుండ కోవిడ్ వేక్సిన్ వేసే చోట పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంతోపాటు బ్లీచింగ్ చైన్ ఏర్పాటు చేయాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామసచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
సిఫార్సు