ఉపాధ్యాయుల శిక్షణ విద్యార్ధులకు ఉపయోగపడాలి..


Ens Balu
4
Rowthulapudi
2021-08-28 09:53:51

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ఇచ్చే ఓరియంటేషన్(కొత్త పాఠ్యపుస్తకాలపై) శిక్షణ విద్యార్ధులకు అందించే విధంగా ఉపాధ్యాయులు తర్పీదు పొందాలని ఎంపీడీఓ ఎస్వీ. నాయుడు పేర్కొన్నారు. శనివారం రౌతులపూడి ఎంఈఓ కార్యాలయంలో జరుగుతున్న ఉపాధ్యాయుల ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రస్తుతం ఇంగ్లీషు మీడియంలో విద్యాభోధన అందిస్తున్న తరుణంలో శిక్షణ పొంది మంచి విద్యను పాఠశాలల్లో కూడా విద్యార్ధులకు అంచాలన్నారు. కార్పోరేట్ పాఠశాలలకు ధీటు ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే అవకాశం ఒక్క ఉపాధ్యాయులకు మాత్రమే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో, రీసోర్స్ పర్శన్లు జి.క్రిష్ణ, సోమశేఖర్, రామచంద్రరావు,జి.నాగరాజు, జి.కొండబాబు, 40పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సిఫార్సు