శంఖవరంలో945 మందికి కోవిడ్ టీకా పంపిణీ..


Ens Balu
6
Sankhavaram
2021-08-28 15:50:20

శంఖవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 945 మందికి కోవిడ్-19 వేక్సిన్ పంపిణీ పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ  తెలియజేశారు. ఈమేరకు శనివారం పీహెచ్సీలో ఆయన మీడియాతో మాట్లాడారు.  జిల్లా కేంద్రం నుంచి పీహెచ్సీకికి 105 వైల్స్ కోవిడ్ డోసులు కేటాయించారని వాటిలో వేశామని చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 18 ఏళ్లు నిండిన వారితోపాటు, రెండవ డోసులు కూడా ఈ కోవిడ్ వేక్సిక్ డ్రైవ్ లో పంపిణీ చేశామన్నారు.  మండల  కేంద్రంలోని మూడు సచివాలయాలతోపాటు, పీహెచ్సీలోనూ టీకాలు అందించినట్టు డాక్టర్ మీడియాకి వివరించారు. అన్ని కేంద్రాల వద్ద జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వేక్సినేషన్ జరిపుతున్నామన్నారు.
సిఫార్సు