పెద్ద సారూ మా రోడ్డు పరిస్థితి ఓసారి చూద్దురు..


Ens Balu
1
ఎస్.రాయవరం
2020-09-06 12:14:09

విశాఖజిల్లా, ఎస్.రాయవరం మండలంలో మద్దాలవీధి లింగరాజుపాలెం రహదారి చాలా దారుణంగా తయారైంది. రోడ్డు మొత్తం గతుకుల మయంగా మారింతి. చిన్న వర్షంగా పడినా గోతులన్నీ మురుగు నీటిత నిండిపోయి ప్రయాణానికే ఇబ్బందులు ఏర్పాడుతున్నాయి. దీంతో ఈ ప్రధాన రహదారిలో ప్రయాణించడానికి వాహన చోదకులు తీవ్రవ ఇబ్బందులు పడుతున్నారు. తమ ప్రాంతాల్లో రోడ్ల దుస్థితిని ప్రభుత్వ అధికారులు స్వయంగా చూస్తే తప్పా తాము పడుతున్న ఇబ్బందులు తెలియవని సామాజివేత్త, సహచట్టం కార్యకర్త సోమిరెడ్డి రాజు తెలియజేస్తున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, రోడ్డు మొత్తం గుంతలు పడిపోయి రాళ్లు పైకి తేలిపోవడంతో ఈహదారిలో ప్రాయాణం చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని స్థానిక ఎంపీడీఓ ద్రుష్టికి తీసుకెళ్లామన్నారు. కొత్తరోడ్డు వేయకపోయినా రోడ్డులో పడ్డ భారీ గుంతలను పూడ్చినా కాస్త ఉపసమనం లభిస్తుందని ఆయన తెలియజేస్తున్నారు. ప్రభుత్వం నరేగా నిధులతో ఈ ప్రాంతంలో కొత్తరోడ్డు వేస్తే ప్రధాన రహదారి ఇబ్బందులు తొలగుతాయని రాజు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.