శంఖవరంలో110 మందికి టీకా పంపిణీ..


Ens Balu
5
శంఖవరం
2021-08-29 11:39:05

శంఖవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 110మందికి కోవిడ్-19 వేక్సిన్ పంపిణీ పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ  తెలియజేశారు. ఈమేరకు ఆదివారం పీహెచ్సీలో  నుంచి ఆయన మీడియాకి ప్రకటన విడుదల చేశారు.  జిల్లా కేంద్రం నుంచి పీహెచ్సీకి వచ్చిన కోవిడ్ వైల్స్ లో మిగులు డోసులను ఈ రోజు పూర్తిచేసినట్టు చెప్పారు.  ప్రభుత్వ నిబంధనల ప్రకారం 18 ఏళ్లు నిండిన వారితోపాటు, రెండవ డోసులు కూడా ఈ కోవిడ్ వేక్సిక్ డ్రైవ్ లో పంపిణీ చేశామన్నారు.  మండల  కేంద్రంలోని మూడు సచివాలయాలతోపాటు, పీహెచ్సీలోనూ టీకాలు అందించినట్టు డాక్టర్ మీడియాకి వివరించారు. అన్ని కేంద్రాల వద్ద జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వేక్సినేషన్ జరుపుతున్నామన్నారు.

సిఫార్సు