పౌష్టికాహారంపై అవగాహన పెంచుకోవాలి..


Ens Balu
5
Annavaram
2021-09-02 08:08:33

గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడంతోపాటు కడుపులో పెరిగే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఎదుగుతుందని 104 డాక్టర్ ఎస్.ఎస్.రాజీవ్ కుమార్ అన్నారు. బుధవారం అన్నవరం-3 పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పౌష్టికాహార మాసోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. పిల్లల తల్లులంతా పౌష్టికాహారంపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రభుత్వం అందించే బలవర్ధక ఆహారం తీసుకోవడంతోపాటు, నిత్యం, పాలు, ఆకుకూరలు, పప్పు, గ్రుడ్లు అధికంగా తీసుకోవాలన్నారు. ఏఏ ఆహారాల్లో పోషక విలువలు ఉంటాయో అంగన్వాడీ కేంద్రాల్లోని కార్యకర్తల ద్వారా తెలుసుకొని పాటించడం ద్వారా తల్లుల ఆరోగ్యంతోపాటు, పిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుందన్నారు. పిల్లలకు కూడా అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇచ్చే బాలమ్రుతం పెట్టడం ద్వారా పిల్లలు ఆరోగ్యం బాగుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో  అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
సిఫార్సు